Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Simha rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Simha Rashi in Telugu

మఖ 4 పాదాలు (మ, మి, ము, మే),
పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
ఉత్తర 1వ పాదం (టె)
ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి ఎనిమిదవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత తొమ్మిదవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి ఆరవ స్థానమైన మకర రాశి నుంచి, ఏడవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు తొమ్మిదవ స్థానమైన మేష రాశి నుంచి, ఎనిమిదవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు మూడవ స్థానమైన తులా రాశి నుంచి రెండవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు .
సింహ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా, ద్వితీయార్థం కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శని దృష్టి తొమ్మిదవ ఇంటిపై, ఒకటవ స్థానం పై మరియు నాలుగో ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం ప్రథమార్ధంలో మీరు మీకు ఇష్టం లేకున్నప్పటికీ దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అదనపు బాధ్యతలు కూడా మీ పై ఉండడంతో క్షణం తీరిక లేకుండా పని చేయాల్సి వస్తుంది. కుటుంబానికి దూరంగా పని చేయాల్సి రావడంతో మీరు మానసికంగా కొంత ఆందోళనకు లోనయ్యేవారు అవకాశం ఉంది. మీ పై అధికారుల ఒత్తిడి కూడా ఈ సమయంలో మీపై ఎక్కువగా ఉండటంతో మీరు నిరాశకు, అసహనానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంత శ్రద్ధగా పనిచేసినప్పటికీ మీ పై అధికారులు మీరు చేసిన పనిలో లోపాలను ఎత్తి చూపడం వలన మీరు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో కేతువు గోచారం మూడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన మీరు అప్పుడప్పుడు నిరాశకు లోనయినప్పటికీ, మీ సహోద్యోగులు మరియు మిత్రుల సహకారంతో ఉత్సాహాన్ని తిరిగి పొందగలుగుతారు. ఏప్రిల్ చివరి వారంలో గురు గోచారం తొమ్మిదవ ఇంటికి మారటంతో వృత్తి పరంగా మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. మీరు తిరిగి మీ సొంత ప్రాంతానికి రావటం వలన మానసికంగా ఉన్న ఒత్తిళ్లు కొంత మేరకు తగ్గుతాయి. శని గోచారం ఏడవ ఇంట్లో అంతగా అనుకూలంగా లేనప్పటికీ, గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి రావటం వలన మీ పై అధికారులతో గత కొంతకాలంగా ఉన్న సమస్యలు కూడా దూరమవుతాయి. గతంలో మీకు ఇచ్చిన పనులు మీరు నిజాయితీగా పూర్తిచేయడం వలన దాని ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందుతారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేస్తున్న వారికి మే నుంచి నవంబర్ మధ్యలో అనుకూల ఫలితం లభిస్తుంది. గురు దృష్టి ఒకటవ స్థానం పై ఉండటం వలన ఏప్రిల్ నుంచి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, దాని వలన మీ వృత్తిలో ఏకాగ్రతతో పని చేయగలుగుతారు. గతంలో మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న అధికారులు మిమ్మల్ని మీ పనిని మెచ్చుకుంటారు. మీరు ఇచ్చే సలహాలు మరియు మీ ఆలోచనలు మీ కార్యాలయ అభివృద్ధికి సహకరించడం వలన మీ వృత్తిలో పదోన్నతితో పాటుగా మీకు ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. అయితే శని గోచారం సంవత్సరమంతా ఏడవ ఇంటిలో ఉండటం వలన కొన్నిసార్లు మీ సహోద్యోగులు వారి ఈర్ష్య కారణంగా మీ గురించి మీ పై అధికారులకు తప్పుగా చెప్పడం కానీ లేదా మీరు చేసే పనులకు అడ్డంకులు కలిగేలా చేయడం కానీ చేయవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్ధంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ తర్వాత నుంచి ఉద్యోగంలో ఆటంకాలు, సమస్యలు తగ్గుతాయి. అక్టోబర్ చివరి వారంలో రాహు, కేతువుల గోచారం మూలంగా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా రహస్య శత్రువులు కారణంగా కానీ, లేదా గతంలో చేసిన తప్పుల గురించి మీ పై అధికారులకు తెలియడం వల్ల కాని మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో గురు గోచారం బాగుంటుంది కాబట్టి ఆ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపించదు. వృత్తిలో మార్పును కోరుకునే వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యకాలం, జులై 17 నుంచి ఆగస్టు 17 మధ్యకాలం మరియు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 మధ్యకాలం వృత్తిలో ఎక్కువ పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వృత్తిలో మార్పు కావాలనుకోవడం, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయటం సరైన ఫలితాన్ని ఇవ్వదు.
వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్య ఫలితాలను, ద్వితీయార్థం కొంత అనుకూల ఫలితాలను ఇస్తుంది. సంవత్సరమంతా శని గోచారం ఏడవ ఇంటిలో ఉండటం, ఏప్రిల్ వరకు గురు గోచారం 8వ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో ఒడిదుడుకులను, నష్టాలను ఎదుర్కుంటారు. ఈ సమయంలో మీరు ఎంత శ్రమించినా అప్పటికీ సరైన విధంగా వ్యాపారం జరగకపోవడం వలన కొంత నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడి పెట్టిన డబ్బులకు కూడా సరైన రాబడులు లేకపోవడంతో కొంత ఒత్తిడికి లోనవుతారు. శని దృష్టి ఒకటవ స్థానం పై ఉండటం వలన మీరు చేసే ఆలోచనలో కూడా సరైన ఫలితాన్ని ఇవ్వక పోవడం వలన మీరు వ్యాపార విషయంలో నష్టాలను చూసే అవకాశం ఉంటుంది. శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి రేయింబవళ్ళు కష్టపడాల్సి వస్తుంది. మీ వ్యాపార భాగస్వాములతో కూడా కొన్ని ఇబ్బందులు ఈ సమయంలో ఎదురవుతాయి. మీరు వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది మీతో వ్యాపార భాగస్వామ్యాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్లో గురువు గోచారం తొమ్మిదవ ఇంటికి మారటంతో ఈ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. మీరు చేసే ఆలోచనలు, పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మీకు లాభాలను ఇస్తాయి. దాని కారణంగా గతంలో వ్యాపార అభివృద్ధికి మీరు చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తిరిగి తీర్చగలుగుతారు. గురు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన మీరు కొత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వటం వలన వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే పోటీ వాతావరణాన్ని కూడా తట్టుకొని వ్యాపారంలో నిలదొక్కుకో గలుగుతారు. మీ వ్యాపార భాగస్వాములు కూడా మీ శ్రమను గుర్తించి తగిన సహాయ సహకారాలను అందిస్తారు. ఈ మధ్యలో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీరు కొత్త ప్రదేశాల్లో కూడా ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ వరకు గురువు మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేయాలనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావటం వలన డబ్బుకు ఇబ్బంది పడతారు. మీ స్నేహితుల దగ్గర లేదా కుటుంబ సభ్యుల దగ్గర ఈ సమయంలో డబ్బు చేబదులు తీసుకునే అవకాశం ఉంటుంది. శని గోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన గతంలో మీకు డబ్బు ఇచ్చిన వారు డబ్బు తిరిగి ఇమ్మని మిమ్మల్ని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా ఈ సమయంలో సరైన రాబడి లేకపోవడంతో కొంత ఇబ్బందికి లోనవుతారు. ఈ సమయంలో గురువు దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన మీకు ఏదో ఒక రూపంలో అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. దానివలన మీరు గతంలో తీసుకున్న అప్పులు తీర్చ కలుగుతారు. ఏప్రిల్ చివరిలో గురువు గోచారం అనుకూలంగా రావడంతో మీ ఆర్థిక స్థితి మెరుగు పడటం ప్రారంభమవుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు నుంచి మంచి రాబడులు రావటంతో మీరు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. గతంలో తీసుకున్న అప్పులు తిరిగి తీర్చగల అవుతారు. అంతేకాకుండా ఈ సమయంలో వారసత్వ సంబంధ ఆస్తులు కానీ లేదా మీకు రావలసిన డబ్బు కానీ మీకు అందటం వలన మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడగలుగుతారు. ఈ సంవత్సరం మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదా ఇల్లు, వాహనం లాంటివి కొనుగోలు చేద్దామనుకున్నా అది ఏప్రిల్ చివరి వారం నుంచి అక్టోబర్ చివరి వారం మధ్యలో చేయటం మంచిది. అక్టోబర్ చివరలో రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలోకి వస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇతరుల మాటలు విని పెట్టుబడులు పెట్టడం అంతగా మంచిది కాదు. దానివలన మీకు ఆర్థికంగా నష్టం జరగనప్పటికీ, అవసరానికి తగిన డబ్బు మీకు అందుబాటులో లేకుండా పోయే అవకాశముంటుంది. ఈ. సంవత్సరం చివరలో కేతు గోచారం రెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి గతంలో మీరు పెట్టిన పెట్టుబడి నుంచి ఆకస్మిక ధన లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి గురు దృష్టి లగ్నం పై, మూడవ ఇంటిపై మరియు అయిదవ ఇంటిపై ఉండటం వలన షేర్ మార్కెట్ లాంటి వాటిలో పెట్టే పెట్టుబడులు లాభాలను ఆర్జించి పెడతాయి. అయితే ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇతరుల ఒత్తిడులకు లొంగకుండా మీరు స్వయంగా మంచి, చెడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 14 మధ్యకాలం, జులై 17 నుంచి ఆగస్ట్ 17 మధ్యకాలం మరియు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 17 మధ్యకాలం ఆర్థికంగా అనుకూలించదు కాబట్టి ఈ సమయంలో ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కాలేయము, ఊపిరితిత్తులు, మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జీర్ణాశయ సంబంధ ఆరోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలు కూడా మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెడతాయి. అయితే కేతువు గోచారం మూడవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మానసిక సమస్యల నుంచి తొందరగానే బయట పడగలుగుతారు. శారీరక ఆరోగ్య విషయంలో మాత్రం ఈ సంవత్సరం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఏప్రిల్ చివరి వారం నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా గురువు దృష్టి ఒకటవ స్థానం పై మరియు ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో బయట పడగలుగుతారు. ఈ సంవత్సరం శని దృష్టి నాలుగవ ఇంటిపై, ఒకటవ స్థానంపై మరియు తొమ్మిదవ స్థానంపై ఉంటుంది కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. శని దృష్టి కారణంగా మీరు మానసిక ఒత్తిడికి లోనై మీ భోజనంపై శ్రద్ధ పెట్టకపోవడం వలన మీరు జీర్ణాశయ సంబంధ ఆరోగ్య సమస్యలు మరియు స్థూలకాయ సంబంధ సమస్యలతో బాధ పడే అవకాశముంటుంది. సమయానికి తగిన భోజనం తీసుకోవడం, అవసరమైనంత నిద్రను కలిగి ఉండటం వలన ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మీరు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. నవంబర్ నుంచి రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు జననాంగ సంబంధ ఆరోగ్యసమస్యలు మరియు అలర్జీల కారణంగా బాధపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు వచ్చే ఆరోగ్యసమస్యలు తొందరగానే తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం మే 10 నుంచి జులై ఒకటి మధ్యలో మరియు నవంబర్ 16 నుంచి సంవత్సరాంతం వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు వాహనాలు నడపడంలో మరియు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో వీలైనంతవరకు ఆవేశానికి లోను కాకుండా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవటం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
సింహ రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన కుటుంబంలో ప్రశాంతత కరువవుతుంది. శని గోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు ఎక్కువ అవుతాయి. మీ జీవిత భాగస్వామి మీపై పెత్తనం చెలాయిస్తున్నారనే అభిప్రాయం కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు పడే అవకాశం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సంయమనం లోపించడం వలన కుటుంబంలో ప్రశాంతత కరువవుతుంది. గురు గోచారం కూడా ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం వలన మీ జీవిత భాగస్వామి కొరకు డబ్బు ఖర్చు చేయాల్సి రావటం కానీ లేదా మీ కుటుంబ సభ్యుల గురించి, వారి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సి రావటం కానీ జరుగుతుంది. ఈ సమయంలో రాహువు గోచారము తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన మీ తండ్రిగారి ఆరోగ్య విషయంలో కానీ, మీ ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం విషయంలో కానీ మీరు ఆందోళన చెందుతారు. అయితే ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. మీ ఇంట్లో జరిగే శుభకార్యాల కారణంగా కానీ, ఇంటి పెద్దల కారణంగా కానీ మీ మధ్య ఉన్న అభిప్రాయభేదాలు తొలగిపోతాయి. దానివలన ఇంటిలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ పిల్లల విజయాల కారణంగా కూడా మీరు ఆనంద పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు సంతానం గురించి లేదా వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లు అయితే ఏప్రిల్ తర్వాత మీ కోరిక తీరే అవకాశం ఉంటుంది. గురు గోచారం తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. గురు దృష్టి మీ రాశి పై మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన మీరు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయటం కానీ దేవాలయ సందర్శన చేయటం కానీ జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఆధ్యాత్మికంగా మార్గం చూపించే గురువులను కూడా ఈ సమయంలో సందర్శించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గతంలో ఉన్న సమస్యలు తగ్గిపోవటం వలన మీ జీవిత భాగస్వామితో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ ఈ ప్రయాణాలు చేస్తారు. శని దృష్టి ఈ సంవత్సరం అంతా నాలుగవ ఇంటిపై ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఉద్యోగ రీత్యా కాని, వ్యాపార రీత్యా కానీ మీరు కొంతకాలం మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మీరు ఆలోచనలకంటే ఎక్కువ ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వటం వలన వ్యక్తిగతంగా మీకు మీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుతుంది. శని గోచారం ఏడవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం శత్రు భయం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతరులతో వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా అక్టోబర్ చివరి నుంచి రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మరీ ముఖ్యంగా మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సింహ రాశి లో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం మరియు శని గోచారం బాగుండదు కాబట్టి వీరికి చదువు విషయంలో శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అనవసర విషయాల మీద సమయాన్ని వృధా చేస్తుంటారు. శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన అలాగే తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన విద్యాభ్యాసంలో ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసంలో ఆటంకాలను ఎదుర్కుంటారు. అయితే ఏప్రిల్ వరకు గురువు దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన ఆటంకాలు వచ్చినప్పటికీ ఎక్కువగా ప్రయత్నించడం వలన వారు అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం తొమ్మిదవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు చదువుపై ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా తమ ప్రతిభను పెంచుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆలోచన కూడా ఈ సమయంలో పెరగటం వలన చదువు గురించి ఎక్కువగా శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. గురు దృష్టి ఒకటవ స్థానం పై ఉండటం వలన గతంలో ఉన్న ఆందోళన తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సమయంలో విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులు అనుకూల ఫలితాలను పొందుతారు. అయితే తొమ్మిదవ ఇంటిపై శని దృష్టి కారణంగా ఒకటికంటే ఎక్కువ సార్లు ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం విఫలం అయితే కుంగిపోకుండా మరొక సారి ప్రయత్నించడం వలన అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. ఒకటవ స్థానం పై శని దృష్టి కూడా ఉండటం వలన ఒక్కోసారి బద్దకాన్ని అలవరచుకొని చదువు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గురువులు మరియు పెద్దల సహకారంతో విద్యార్థులు బద్దకాన్ని వదిలి వారి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగం కొరకు కాంపిటీటివ్ పరీక్షలు రాసే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో వారి ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది.
ఈ సంవత్సరం సింహ రాశి వారికి ప్రథమార్ధంలో గురు గోచారం, సంవత్సరమంతా శని గోచారం, సంవత్సరం చివరలో రాహు గోచారం బాగుండదు కాబట్టి ఈ గ్రహాల అనుగ్రహం కొరకు సమస్యలు తొలగిపోవడానికి గురు, శని, మరియు రాహు గ్రహ పరిహారాలు ఆచరించడం మంచిది. ఏప్రిల్ వరకు గురువు గోచారం బాగుండదు కాబట్టి ప్రతిరోజు కానీ, ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం అలాగే విద్యార్థులకి చదువుకు అవసరమైన పుస్తకాలు కానీ ఇతర వస్తువులు కానీ దానం చేయటం వలన గురువు శుభ ఫలితాలు ఇస్తాడు. సంవత్సరమంతా శని గోచారం ఏడవ ఇంటిలో ఉంటుంది కాబట్టి శని ఇచ్చే సమస్యలు తొలగిపోవడానికి, శనిని శాంతింప చేయటానికి ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ శని స్తోత్రం చదవటం, శని మంత్ర జపం చేయటం లేదా శనికి కానీ, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం వలన శని శుభ ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా పేదలకు కానీ, వికలాంగులకు కానీ సహాయం చేయడం వలన కూడా శని తృప్తి చెందాడు. సంవత్సరాంతంలో రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ రాహు మంత్ర జపం చేయటం లేదా రాహు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఇదే కాకుండా దుర్గా సంబంధ స్తోత్రం కానీ దుర్గాదేవికి పూజ చేయటం కానీ చేసినట్లయితే రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.

People living in other countries, contribute via PayPal.